మామునూరు ఎయిర్‌పోర్ట్‌కు మరో అడుగు 

భూసేకరణకు 205 కోట్లు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం

మామునూరు ఎయిర్‌పోర్ట్‌కు మరో అడుగు 

వరంగల్,తెలంగాణ ముచ్చట్లు:

వరంగల్ విమానాశ్రయ నిర్మాణానికి సంబంధించి భూసేకరణ నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం 205 కోట్ల రూపాయలు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు కడియం కావ్య స్పందిస్తూ, మామునూరులో విమానాశ్రయ నిర్మాణానికి ఇది కీలక ముందడుగుగా  పేర్కొన్నారు.

సాంకేతికంగా అడ్డంకిగా మారిన 150 కిలోమీటర్ల పరిమితిపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నుంచి ఇప్పటికే అనుమతులు పొందిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. నిధుల విడుదలతో రాష్ట్ర ప్రభుత్వం విమానాశ్రయ నిర్మాణం పట్ల చూపిన నిబద్ధతను మరోసారి స్పష్టంగా తెలిపినట్టు అభిప్రాయపడ్డారు.

చారిత్రక ప్రాధాన్యం కలిగిన వరంగల్ నగర అభివృద్ధిలో విమానాశ్రయం నిర్మాణం ఒక కీలక మైలురాయిగా నిలవనుందని అన్నారు. ఈ ప్రాజెక్టుపై కేంద్ర విమానయాన శాఖ తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .