మైనార్టీ గురుకులాల ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకోవాలి.. 

జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

మైనార్టీ గురుకులాల ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకోవాలి.. 

ఖమ్మం బ్యూరో, జనవరి - 20 (తెలంగాణ ముచ్చట్లు)

 జిల్లా మైనార్టీ గురుకుల పాఠశాలల ప్రవేశాల కోసం, ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో చేరాలనుకునే వారు వెంటనే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి పేర్కొన్నారు.

తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ ( టీజీ ఎంఆర్పిఐఎస్) ఆధ్వర్యంలో 2026–27 విద్యా సంవత్సరానికి గాను మైనారిటీ గురుకుల పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో అడ్మిషన్లకు సంబంధించిన పోస్టర్‌ను మంగళవారం కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ* మైనారిటీ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంలో గురుకుల విద్యాలయాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. అర్హత కలిగిన మైనారిటీ విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, అడ్మిషన్ల ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా నిర్వహించబడుతుందని అన్నారు.

ఇంటర్మీడియట్ తో పాటు, 6, 7, 8 తరగతుల్లో ఉన్న బ్యాక్‌ లాగ్ ఖాళీలను కూడా భర్తీ చేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ అడ్మిషన్లకు సంబంధించి గడువులోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.  

ఈ కార్యక్రమంలో జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి ఎం.డి. ముజాహిద్, తెలంగాణ మైనారిటీ విద్యాసంస్థల ప్రాంతీయ కో ఆర్డినేటర్ ఎం.జె. అరుణ కుమారి, గురుకుల పాఠశాలల, కళాశాలల ప్రిన్సిపాల్ లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .