ఎంబీబీఎస్ విద్యార్థికి అయ్యపురెడ్డి ఫౌండేషన్ అండ.
పుస్తకాల కొనుగోలుకు రూ.10 వేల ఆర్థిక ప్రోత్సాహకం.
Views: 0
On
పెద్దమందడి,సెప్టెంబర్20(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి జిల్లా మండలంలోని మోజర్ల గ్రామానికి చెందిన గట్టు రమేష్ కుమారుడు గట్టు యువరాజ్ ఎంబీబీఎస్ సీటు సాధించిన సందర్భంగా అయ్యపురెడ్డి మెమోరియల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రోత్సాహక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వనపర్తి ప్రజావైద్యశాల డాక్టర్ మురళీధర్ చేతుల మీదుగా యువరాజ్ను సన్మానించారు.విద్యార్థి వైద్య విద్యకు అవసరమైన పుస్తకాల కొనుగోలు కోసం ఫౌండేషన్ తరఫున రూ.10,000 నగదు ప్రోత్సాహకాన్ని అందజేశారు. యువరాజ్ పట్టుదలతో చదివి ఎంబీబీఎస్ విద్యను విజయవంతంగా పూర్తి చేసి, భవిష్యత్లో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు.గ్రామీణ ప్రాంత విద్యార్థులను ప్రోత్సహించేందుకు అయ్యపురెడ్డి మెమోరియల్ ఫౌండేషన్ చేస్తున్న కృషిని పలువురు అభినందించారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
20 Sep 2026 19:15:57
వనపర్తి,సెప్టెంబర్20(తెలంగాణ ముచ్చట్లు):
నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాల దిశగా మార్గనిర్దేశం చేయడంతో పాటు విద్యార్థుల్లోని ప్రతిభను వెలికితీయాలనే లక్ష్యంతో పరవస్తు క్రియేటివ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత...


Comments