భయాన్ని కాదు.. భరోసాను ఇవ్వాలి.

భయాన్ని కాదు.. భరోసాను ఇవ్వాలి.

వంగర గురుకులంలో విద్యార్థుల భద్రతపై ఆందోళన

-ప్రిన్సిపాల్‌, సిబ్బందిపై నిష్పక్షపాత విచారణ జరపాలి: బీజేపీ జిల్లా కార్యదర్శి పైడిపెల్లి పృథ్విరాజ్‌ గౌడ్‌

భీమదేవరపల్లి, సెప్టెంబర్‌ 19(తెలంగాణ ముచ్చట్లు): 

వంగరలోని డాక్టర్‌ పి.వి. నర్సింహారావు బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థుల భద్రత, మానసిక స్థితిపై సమగ్ర విచారణ చేపట్టాలని బీజేపీ జిల్లా కార్యదర్శి పైడిపెల్లి పృథ్విరాజ్‌ గౌడ్‌ డిమాండ్‌ చేశారు. విద్యార్థులకు భరోసా కల్పించాల్సిన గురుకుల యాజమాన్యం, వారిలో మరింత ఆందోళన కలిగించేలా వ్యవహరించడం సరికాదని అన్నారు.

. విద్యార్థిని చదువుకు ఆటంకం కలిగించారనే ఆరోపణలు

భీమదేవరపల్లి మండలం వంగరలోని గురుకులంలో తొమ్మిదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని అక్క ఆత్మహత్య చేసుకున్న అనంతరం అంత్యక్రియలకు వెళ్లి తిరిగి వచ్చిన విద్యార్థినిని పాఠశాలలో కొనసాగించేందుకు ప్రిన్సిపాల్‌ నిరాకరించారనే ఆరోపణలు వచ్చాయని పృథ్విరాజ్‌ గౌడ్‌ తెలిపారు. విద్యార్థిని తల్లిదండ్రులు ప్రిన్సిపాల్‌ తీరుపై చేసిన ఆరోపణలు ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్నారు.

. గత ఘటనలపై కూడా విచారణ అవసరం

ఇదే గురుకులంలో గతంలో పదో తరగతి విద్యార్థిని శ్రీవర్షిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటనను ఆయన ప్రస్తావించారు. ఆ సమయంలోనూ ప్రిన్సిపాల్‌, ఉపాధ్యాయుల వేధింపులపై తల్లిదండ్రులు ఆరోపణలు చేశారని తెలిపారు. ఇటీవల గట్లనర్సింగపూర్‌కు చెందిన ఓ విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు సమాచారం ఉందని, అనంతరం ఆమెకు టీసీ ఇచ్చి పంపించారనే ఆరోపణలు ఉన్నాయని అన్నారు.

. ప్రిన్సిపాల్‌, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలి

వరుసగా చోటుచేసుకుంటున్న ఘటనల నేపథ్యంలో గురుకులంలో విద్యార్థుల భద్రత, మానసిక ఆరోగ్యం, పర్యవేక్షణ వ్యవస్థపై సమగ్ర విచారణ జరపాలని పృథ్విరాజ్‌ గౌడ్‌ కోరారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రిన్సిపాల్‌, సిబ్బందిపై విచారణ పూర్తయ్యే వరకు సస్పెన్షన్‌ సహా తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

. సిబ్బందిని మార్చాలని డిమాండ్‌

ప్రస్తుత సిబ్బందిని బదిలీ చేసి, కొత్త సిబ్బందిని నియమించాలని ఆయన కోరారు. విద్యార్థుల భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా ఉన్నతాధికారులు తక్షణమే స్పందించాలని అన్నారు.

. గురుకులాల్లో ప్రత్యేక పర్యవేక్షణ వ్యవస్థ ఏర్పాటు చేయాలి

రాష్ట్రంలోని అన్ని గురుకులాల్లో విద్యార్థుల భద్రత, మానసిక ఆరోగ్యం, ఫిర్యాదుల పరిష్కారం కోసం ప్రత్యేక పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని పృథ్విరాజ్‌ గౌడ్‌ కోరారు. గురుకులాలు విద్యార్థుల్లో భయాన్ని కాకుండా భవిష్యత్తుపై భరోసాను కల్పించే వాతావరణాన్ని అందించాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జర్నలిస్టుల హక్కుల సాధనకు ఐక్య పోరాటమే శరణ్యం. జర్నలిస్టుల హక్కుల సాధనకు ఐక్య పోరాటమే శరణ్యం.
అశ్వారావుపేట, సెప్టెంబర్ 19 (తెలంగాణ ముచ్చట్లు):  ప్రజా సమస్యల పరిష్కారానికి నిత్యం కలమెత్తి పోరాడే జర్నలిస్టులు.. నేడు తమ హక్కులు, వృత్తి భద్రత కోసం పోరాడాల్సిన పరిస్థితి...
ప్రభుత్వ పాఠశాలలకు అధిక నిధులు కేటాయించాలి.
అంబేద్కర్‌ను అవమానిస్తే సహించం.
జవహర్ నగర్ మల్కారంలో ఘనంగా అన్నదాన కార్యక్రమం.
నిరుపేద MBBS విద్యార్థినికి అండగా డా. కవ్వంపల్లి.
భయాన్ని కాదు.. భరోసాను ఇవ్వాలి.
జవహర్‌నగర్‌లో ఉచిత వైద్య శిబిరం.