అక్టోబర్ 18న బీసీ బంద్ విజయవంతం చేయాలి
నక్క కృష్ణ యాదవ్ పెద్దమందడి మండల ఐక్యవేదిక అధ్యక్షులు
పెద్దమందడి,అక్టోబర్16(తెలంగాణ ముచ్చట్లు):
బీసీ రిజర్వేషన్ 42% సాధన దిశగా రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఉద్యమానికి ఐక్యతతో మద్దతు తెలపాలని పెద్దమందడి మండల ఐక్యవేదిక అధ్యక్షుడు నక్క కృష్ణ యాదవ్ పిలుపునిచ్చారు. అక్టోబర్ 18న జరగబోయే బీసీ బంద్ను విజయవంతం చేయాలని ఆయన అన్ని వర్గాల ప్రజలను కోరారు.ఈ సందర్భంగా నక్క కృష్ణ యాదవ్ మాట్లాడుతూ..
“బీసీ వర్గాల జనాభా రాష్ట్రంలో 52% ఉన్నా, రిజర్వేషన్లు మాత్రం కేవలం 29% మాత్రమే ఉన్నాయి. విద్య, ఉద్యోగాలు, రాజకీయ ప్రాతినిధ్యంలో బీసీలు ఇంకా వెనుకబడి ఉన్నారు. అందుకే బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించడం సమాజ సమానత్వానికి దోహదం చేస్తుంది. ఈ బంద్ ప్రధాన ఉద్దేశం — బీసీ హక్కుల సాధన కోసం ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేయడం” అన్నారు.
అలాగే ఆయన “బీసీ రిజర్వేషన్ 42% కల్పిస్తే విద్యా రంగంలో బీసీ విద్యార్థులకు మరిన్ని అవకాశాలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రాతినిధ్యం, స్థానిక సంస్థల్లో నాయకత్వ స్థానాలు లభిస్తాయి. ఇది బీసీ వర్గాల ఆర్థిక, సామాజిక స్థాయిని బలోపేతం చేస్తుంది” అన్నారు.
మండలంలోని అన్ని బీసీ సంఘాలు, విద్యాసంస్థలు, వ్యాపార వర్గాలు, ప్రజా సంస్థలు బంద్కి మద్దతుగా నిలిచి విజయవంతం చేయాలని నక్క కృష్ణ యాదవ్ పిలుపునిచ్చారు. అలాగే బంద్ శాంతియుతంగా, ప్రజలకు ఇబ్బంది కలగకుండా నిర్వహించాలన్నారు.


Comments