నాగారంలో క్రిస్మస్ వేడుకలు 

నాగారంలో క్రిస్మస్ వేడుకలు 

నాగారం, డిసెంబర్ 06 (తెలంగాణ ముచ్చట్లు)

మేడ్చల్ నియోజకవర్గంలోని నాగారం మున్సిపల్ స్టార్ ఫంక్షన్ హాల్‌లో కీసర మండల్ పాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు విశేషంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షులు తోటకూర వజ్రెష్ యాదవ్  ముఖ్య అతిథిగా హాజరయ్యారు.వేడుకలో పాల్గొన్న వజ్రెష్ యాదవ్  క్రైస్తవ సోదర సోదరీమణులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ క్రిస్మస్ ప్రేమ, సౌహార్దం, మానవత్వానికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో నాగారం మున్సిపల్ అధ్యక్షులు ముప్పు శ్రీనివాస్ రెడ్డి, దమ్మైయిగూడ మున్సిపల్ అధ్యక్షులు రామరావు, మాజీ వైస్‌చైర్మన్ మల్లేశ్ యాదవ్, మాజీ కౌన్సిలర్లు హరిబాబు, వెంకట్ రెడ్డి, పంభాల రమేష్, యాదగిరి గౌడ్, సత్తిష్ గౌడ్, మహిపాల్ రెడ్డి, సోమిరెడ్డి, పొట్ట శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.అలాగే పాస్టర్లు, విశ్వాసులు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .