ధర్మసాగర్‌లో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో పరిణామ సిద్ధాంతంపై సదస్సు

ధర్మసాగర్‌లో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో పరిణామ సిద్ధాంతంపై సదస్సు

ధర్మసాగర్,తెలంగాణ ముచ్చట్లు:

జీవ పరిణామం ప్రకృతిలో సహజమైన మార్పు అని విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ ధర్మసాగర్ మండలంలో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో వైజ్ఞానిక సదస్సు నిర్వహించారు. జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో జరిగిన ఈ కార్యక్రమానికి ఇన్‌చార్జి ధర్మప్రకాష్ అధ్యక్షత వహించారు.


WhatsApp Image 2024-12-03 at 2.15.26 PMసదస్సులో “పరిణామ సత్యాన్ని చాటుదాం” అనే అంశంపై జీవశాస్త్ర ఉపాధ్యాయురాలు కవితా దేవి కీలక ఉపన్యాసం చేస్తూ, ప్రతి జీవి తన పూర్వీకుల నుండి పరిణామంతో ఆవిర్భవిస్తుందని, ఇది సహజ లక్షణమని స్పష్టంచేశారు. జన విజ్ఞాన వేదిక తెలంగాణ రాష్ట్ర కమిటీ ప్రచురించిన చార్లెస్ డార్విన్ పరిణామ సిద్ధాంతాన్ని తెలియజేసే పోస్టర్లను ఉపాధ్యాయులు ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుడు సురేష్ సమన్వయకర్తగా వ్యవహరించగా, ఉపాధ్యాయులు పద్మజ, రాజమ్మ, కిరణ్మయి, రామకృష్ణ, ప్రసన్నలు పరిణామ సిద్ధాంతాన్ని కణస్థాయి నుండి జీవ స్థాయి వరకు ఉదాహరణలతో విద్యార్థులకు వివరించారు.సదస్సు విద్యార్థులలో పరిణామ సిద్ధాంతంపై ఆసక్తిని, విజ్ఞానాన్ని పెంచింది.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .