మాజీ మంత్రి దామోదర్ రెడ్డి కన్నుమూత
సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు నేతల నివాళులు
Views: 28
On
ఉప్పల్,అక్టోబర్3(తెలంగాణ ముచ్చట్లు):
మాజీ మంత్రి దామోదర్ రెడ్డి అకాలమరణం తెలంగాణ రాజకీయ, సామాజిక వర్గాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఆయన పార్థివ దేహానికి నివాళులర్పించేందుకు జూబ్లీహిల్స్లోని కుటుంబ నివాసానికి పలువురు ప్రముఖులు చేరుకున్నారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి కలిసి పూలమాలలు సమర్పించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు దామోదర్ రెడ్డి ప్రజా సేవలో చూపిన త్యాగం, కృషి తెలంగాణ ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోతుందని అన్నారు.
తదుపరి, రాజకీయ, సామాజిక వర్గాలకు చెందిన ప్రముఖులు ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. దామోదర్ రెడ్డి చేసిన సేవలు ఎప్పటికీ మరచిపోలేనివిగా నిలిచిపోతాయని పలువురు పేర్కొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments