మర్రిపెల్లి అనిత అభ్యర్థిత్వాన్ని బలపరిచిన జనసేన

మర్రిపెల్లి అనిత అభ్యర్థిత్వాన్ని బలపరిచిన జనసేన

ధర్మసాగర్,డిసెంబర్07(తెలంగాణ ముచ్చట్లు): 

ధర్మసాగర్ మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీలో ఉన్న విద్యావంతురాలు మర్రిపెల్లి అనిత విజయ్ కుమార్ అభ్యర్థిత్వాన్ని జనసేనపార్టీ తరుపున బలపరుస్తున్నట్లు పార్టీ నియోజకవర్గం ఇంచార్జ్ గాదె పృథ్వీ ప్రకటించారు. మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయాలని నిస్వార్ధంగా ముందుకు వచ్చిన సామాన్య గృహిణి, చదువుకున్న మహిళ మర్రిపెల్లి అనిత ను గెలిపించాలని కోరారు.సామాన్యులకు ఎల్లప్పుడూ జనసేనపార్టీ అండగా ఉంటుందన్నారు.యువతతో పార్టీ సంస్థగతంగా బలపడుతుందని వ్యాఖ్యనించారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న అనితకు జనసేనపార్టీ తోడుగా ఉంటుందన్నారు.జనసైనికులు మర్రిపెల్లి అనిత గెలుపుకు కృషి చేయాలని ఆదేశించారు.వార్డు సభ్యురాలిగా సేవలందించి ప్రజల మన్నెలు పొందిన అనితను గ్రామ సర్పంచ్ గా అత్యంత మెజారిటీతో గెలిపించి గ్రామ అభివృద్ధికి తోడ్పాడాలన్నారు. గ్రామ ప్రజలు చదువుకున్న వ్యక్తులను రాజకీయాల్లో ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .