అయ్యప్ప స్వామి పూజలో పాల్గొన్న పరమేశ్వర్ రెడ్డి
మల్లాపూర్, డిసెంబర్ 21 (తెలంగాణ ముచ్చట్లు)
మల్లాపూర్ డివిజన్ నరసింహనగర్ కాలనీలో విక్రమాదిత్య స్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ అయ్యప్ప స్వామి మహాపడి పూజా కార్యక్రమంలో ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి పరమేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన అయ్యప్ప స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.పూజ అనంతరం పరమేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, అయ్యప్ప స్వామి కటాక్షం ప్రజలందరిపై ఉండాలని, ఉప్పల్ నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో, ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో శాంతి, ఐక్యతను పెంపొందిస్తాయని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కప్పర సాయి గౌడ్, ఎస్.వి. కిట్టు, టిల్లు ముదిరాజ్, వల్లపు శ్రీకాంత్ యాదవ్, జానీ చారి, లడ్డు, ఫిరోజ్ ఖాన్, ప్రభు, హరీష్, వినీష్ యాదవ్ తదితరులతో పాటు పెద్ద సంఖ్యలో అయ్యప్ప భక్తులు పాల్గొన్నారు.


Comments