పతకాలతో వెలిగిన సత్తుపల్లి విద్యాలయం విద్యార్థులు.

యూ.సి.ఓ జాతీయ సైబర్‌ ఒలింపియాడ్‌లో ఆల్‌ఇండియా ర్యాంకులు.

పతకాలతో వెలిగిన సత్తుపల్లి విద్యాలయం విద్యార్థులు.

సత్తుపల్లి, నవంబర్ 27 (తెలంగాణ ముచ్చట్లు):

జాతీయ స్థాయి యూనిఫైడ్‌ సైబర్‌ ఒలింపియాడ్‌ పరీక్షల్లో సత్తుపల్లి విద్యాలయం శ్రీ చైతన్య కరికులం విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరచారు. గత నెల నిర్వహించిన ఈ పరీక్షల్లో ఆల్‌ఇండియా స్థాయిలో విశేష ఫలితాలు నమోదు చేసి పాఠశాలకు గౌరవం తీసుకువచ్చారు. దాసరి ఖాస్వి ఏడవ స్థానం, ఆర్‌.కెనీషా పదవ స్థానం, మన్విత పన్నెండవ స్థానం సాధించి నగదు బహుమతులు, బంగారు పతకాలు, ప్రశంసా పత్రాలు అందుకున్నారు. ప్రత్యేక ప్రతిభతో అందరి దృష్టిని ఆకర్షించారు.

అదే విధంగా బాలుర విభాగంలో తన్షిక్‌ నాయుడు, సాయి చరణ్‌, సాత్విక్‌, హర్ష వర్ధన్‌ మెరుగైన విజయం సాధించి బంగారు పతకాలు, ప్రశంసా పత్రాలు పొందారు. విద్యార్థుల విజయాన్ని పాఠశాల నిర్వాహకులు, ఖమ్మం ప్రాంత సమన్వయకర్త కృష్ణారావు అభినందించారు. “జాతీయ స్థాయి పోటీల్లో చురుకుగా పాల్గొని ప్రతిభను దేశం ముందుంచాల’’ని సూచించారు.

ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ నాగరాజు, వైస్ ప్రిన్సిపాల్ అజిత, డీన్ ఎన్‌.వి‌.ఆర్‌, సి-ఇన్‌ఛార్జ్ నాగార్జున, ఐఎన్‌టీఎస్ఓ ఇన్‌ఛార్జ్ సుభాకర్‌తో పాటు ఉపాధ్యాయ బృందం పాల్గొని విద్యార్థులను అభినందించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

అమ్మపల్లి సర్పంచ్ గౌని మాధవి వెంకటేశ్వర రెడ్డికి ఎమ్మెల్యే ఘన సన్మానం అమ్మపల్లి సర్పంచ్ గౌని మాధవి వెంకటేశ్వర రెడ్డికి ఎమ్మెల్యే ఘన సన్మానం
పెద్దమందడి,డిసెంబర్‌13(తెలంగాణ ముచ్చట్లు): వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం అమ్మపల్లి గ్రామంలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్ గౌని మాధవి వెంకటేశ్వర రెడ్డిని వనపర్తి...
మణిగిల్ల సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్‌ను సన్మానించిన మాజీ మంత్రి
వీరాయిపల్లి సర్పంచ్ చిట్యాల వెంకటేష్‌కు ఎమ్మెల్యే ఘన సన్మానం
మణిగిల్ల సర్పంచ్ పీఠం బీఆర్ఎస్ కైవసం
నాచారం ఎరుకల బస్తీలో రోడ్డు సమస్యపై  కార్పొరేటర్ కు వినతి పత్రం 
డ్రోన్ ద్వారా బందోబస్త్ పర్యవేక్షణ
ఘనంగా తేజ ఒకేషనల్ & పారామెడికల్ కళాశాల వార్షికోత్సవం!