జిల్లాలో యూరియా ఎరువుల కొరత లేదు  కలెక్టర్ మను చౌదరి

జిల్లాలో యూరియా ఎరువుల కొరత లేదు  కలెక్టర్ మను చౌదరి

మేడ్చల్ మల్కాజిగిరి కలెక్టర్, డిసెంబర్ 29 (తెలంగాణ ముచ్చట్లు):

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాకు అవసరమైన యూరియా ఎరువులు సరిపడా నిల్వలు ఉన్నాయని, రైతులు ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ మను చౌదరి స్పష్టం చేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో ఈ రోజు వరకు 773 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రతి యూరియా సేల్ కౌంటర్ వద్ద షామియానా, త్రాగునీటి సౌకర్యం కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఉదయం 6.00 గంటల నుంచే యూరియా విక్రయాలు ప్రారంభించాలన్నారు.
ప్రస్తుతం ఉన్న యూరియా నిల్వలు సాగుకు పూర్తిగా సరిపోతాయని, అవసరాన్ని బట్టి అదనపు సరఫరాలు కూడా క్రమం తప్పకుండా అందుతున్నాయని కలెక్టర్ రైతులకు భరోసా ఇచ్చారు. యూరియా పంపిణీపై సంబంధిత అధికారులు, వ్యవసాయ శాఖ సిబ్బంది నిరంతర పర్యవేక్షణ చేపడుతున్నారని తెలిపారు.
యూరియా విషయంలో కృత్రిమ కొరత సృష్టించడం, అధిక ధరలకు విక్రయించడం వంటి అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. రైతులు ఎవరైనా యూరియా సరఫరాలో సమస్యలు ఎదుర్కొంటే సమీప వ్యవసాయ అధికారులను సంప్రదించాలని సూచించారు. అవసరానికి మించి యూరియా కొనుగోలు చేయకుండా, శాస్త్రీయ పద్ధతిలో వినియోగించాలని రైతులను కోరారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .