ఫ్రీ ట్రైనింగ్‌తో పాటు ఉద్యోగావకాశం

ఎల్.జి. కంపెనీ సెంట్రల్ మేనేజర్ సంగ్రం కిశోర్

ఫ్రీ ట్రైనింగ్‌తో పాటు ఉద్యోగావకాశం

కుషాయిగూడ, డిసెంబర్ 30 (తెలంగాణ ముచ్చట్లు)

ఉద్యోగాలు లేని యువతీ యువకులకు ఎల్.జి. కంపెనీ సువర్ణావకాశం కల్పిస్తోందని ఆ కంపెనీ సెంట్రల్ మేనేజర్ సంగ్రం కిశోర్ తెలిపారు. మంగళవారం కమలా నగర్‌లోని ఎల్.జి. ట్రైనింగ్ సెంటర్‌లో నిర్వహించిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడారు.10వ తరగతి పూర్తి చేసిన వారు లేదా అంతకంటే ఎక్కువ చదివిన వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన సూచించారు. 18 నుంచి 28 సంవత్సరాల వయసు గల యువతీ యువకులకు మూడు నెలల పాటు ఉచిత శిక్షణ అందించడంతో పాటు మధ్యాహ్న భోజన సదుపాయం కూడా కల్పిస్తున్నట్లు తెలిపారు.ట్రైనింగ్ పూర్తయిన అనంతరం కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన సర్టిఫికేట్‌తో పాటు ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఎల్.జి. హోప్ టెక్నికల్ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.ఈ అవకాశాన్ని ముఖ్యంగా పేద విద్యార్థులు, అణగారిన వర్గాల యువత సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.వివరాల కోసం 9908625756, 8074368668, 8130438200 నంబర్లను సంప్రదించాలని తెలిపారు.ఈ కార్యక్రమాన్ని రెండు తెలుగు రాష్ట్రాలయువత పూర్తిగా వినియోగించుకోవాలని ఈ సందర్భంగా మార్కెటింగ్ మేనేజర్ డి. రాఘవేంద్ర నాయక్ పిలుపునిచ్చారు. IMG-20251230-WA0271

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .