డెంగ్యూ జ్వరంతో చిన్నారి మృతి

-గ్రామంలో విజృంభిస్తున్న జ్వరాలు 

డెంగ్యూ జ్వరంతో చిన్నారి మృతి

-వైద్య అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని ప్రజల వేడుకోలు 

-గ్రామంలో ప్రత్యేక మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయాలనీ గ్రామస్థుల వినతి 

ధర్మసాగర్,తెలంగాణ ముచ్చట్లు:డెంగ్యూ జ్వరం భారీన పడి ప్రవళిక అనే 11ఏళ్ల చిన్నారి మృతి చెందిన సంఘటన మండలంలో తాటికాయల గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది.పూర్తి వివరాల్లోకి వెళ్తే ...తాటికాయల గ్రామానికి చెందిన మాజీ వార్డు సభ్యులు పెసరు స్వామి కూతురు పెసరు ప్రవళికి గత నాలుగు రోజుల క్రితం జ్వరం రాగ హన్మకొండలోని ప్రయివేట్ ఆసుపత్రిలో చూపించగా పరీక్షలు నిర్వహించి డెంగ్యూ ఫీవర్ గా నిర్ధారించారు.మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ లోని రెయిన్ బో హాస్పిటల్ చేర్పించగా చికిత్స పొందుతూ సోమవారం చిన్నారి మృతి చెందింది.ఈ విషాదకర సంఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.పెసరు స్వామికి ఒక కూతురు,ఒక కుమారుడు ఉన్నారు.కుమారుడు కూడా జ్వరంతో బాధపడుతుండడం గమనార్హం.

 

గ్రామంలో విజృంభిస్తున్న జ్వరాలు :

తాటికాయల గ్రామంలో జ్వరాలు విజృంభిస్తున్నాయి.ఇప్పటికే సుమారు 20 మంది వరకు జ్వరాన భారిన పడి వైద్యం పొందుతున్నారు.అందులో కొందరికి డెంగ్యూ ఫీవర్ తోబాధపడుతున్నట్లుగా తెలుస్తోంది.ఇప్పటికైనా వైద్య శాఖా అధికారులు ప్రత్యేక చొరవ చూపి,గ్రామంలో ప్రత్యేక మెడికల్ వేయించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .