భారత్‌ వైపు దూసుకొస్తున్న బంగ్లాదేశీయులు.. బోర్డర్‌ దగ్గర హైఅలర్ట్

భారత్‌ వైపు దూసుకొస్తున్న బంగ్లాదేశీయులు.. బోర్డర్‌ దగ్గర హైఅలర్ట్

హైదరాబాద్,తెలంగాణ ముచ్చట్లు:

బంగ్లాదేశ్‌లో చెలరేగిన హింసతో భారత్‌లోకి అక్రమ చొరబాట్లు పెరిగే ఛాన్స్‌ ఉంది. భారత్‌లోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్న బంగ్లా దేశీయులను బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ అడ్డుకుంటోంది. బంగ్లా-భారత్‌ సరిహద్దుల్లో రాకపోకలను ఇండియన్‌ ఆర్మీ నిలిపివేసింది. బోర్డర్‌లో ఆర్మీ యూనిట్లను భారత ప్రభుత్వం మరింత అలర్ట్‌ చేసింది. బీఎస్‌ఎఫ్‌ సిబ్బంది సెలవులను రద్దు చేసింది. బోర్డర్‌కు వెళ్లాలని కమాండర్లకు ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం. సరిహద్దుల్లో అదనపు బలగాలతో పహారా కాస్తుంది. చొరబాట్లు జరగకుండా ఉండేందుకు భద్రత కట్టుదిట్టం చేసింది. మరోవైపు బంగ్లాదేశ్‌లో హిందువులు, మైనారిటీలే లక్ష్యంగా దాడులు పెరుగుతున్నాయి మీరంతా షేక్‌ హసీనా అవామీ లీగ్‌ పార్టీ మద్దతుదారులంటూ ఎటాక్స్‌ మొదలు పెట్టారు. మైనారిటీలపై దాడులు చెయ్యొద్దని స్టూడెంట్‌ లీడర్స్‌ విజ్ఞప్తి చేస్తున్నా హింస ఆగడం లేదు. ఢాకా, చటోగ్రామ్‌, రౌజన్‌, జషోర్‌లో హిందువులు, మైనారిటీలే టార్గెట్‌గా దాడులు కొనసాగుతున్నాయి. ఇళ్లు, ఆలయాల నుంచి హిందువులను అల్లరిమూకలు బలవంతంగా తరిమేస్తున్నారు. విగ్రహాలను ధ్వంసంచేసి 20 ఆలయాలకు మతోన్మాదులు నిప్పుపెట్టారు. కర్రలు, ఆయుధాలతో హిందువుల ఇళ్లల్లోకి చొరబడి దాడులు చేన్నారు.

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .