పారిస్ ఒలింపిక్స్ 2024 నీరజ్ చోప్రా"

పారిస్ ఒలింపిక్స్ 2024 నీరజ్ చోప్రా

హైదరాబాద్,తెలంగాణ ముచ్చట్లు:

 భారతదేశం తరపున నీరజ్ చోప్రా ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం సాధించిన మొదటి ఫీల్డ్ అథ్లెట్‌గా నిలిచాడు. టోక్యో ఒలింపిక్స్ 2020లో జావెలిన్ త్రోలో బంగారు పతకం సాధించి చరిత్ర సృష్టించాడు. అప్పటి నుంచి అతను ఈ గేమ్‌లో ప్రపంచం మొత్తాన్ని శాసిస్తున్నాడు. నీరజ్ జావెలిన్ త్రోలో కూడా ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచాడు. ఈ క్రీడలో ఇప్పటివరకు చాలా రికార్డులు సృష్టించాడు. ప్రస్తుతం, నీరజ్ చోప్రా మరోసారి పారిస్ ఒలింపిక్స్ 2024లో బంగారు పతకం సాధించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు. అతను ఇప్పటివరకు ఎలా ప్రయాణించాడు. జావెలిన్ త్రోలో ఎలాంటి అద్భుతాలు చేశాడో తెలుసుకుందాం.

టోక్యో ఒలింపిక్స్‌లో బంగారు పతకం గెలవడానికి ముందు నీరజ్ చోప్రా చాలా తక్కువ మందికి తెలుసు. కానీ, ఈ విజయంతో అతను పోస్టర్ బాయ్‌గా ఫేమస్ అయ్యాడు. అయితే హర్యానాలోని పానిపట్ జిల్లా ఖండ్రా గ్రామానికి చెందిన నీరజ్‌కి క్రీడల్లో చేరడం అభిరుచి కాదు. బలవంతంగా ఇందులో చేరాడు. అతని తల్లి సరోజ్ దేవి గృహిణి. తండ్రి సతీష్ కుమార్ రైతు. చిన్నతనంలో అధిక బరువు కారణంగా, అతని తల్లిదండ్రులు క్రీడలలో పాల్గొనమని ఒత్తిడి చేశారు.

1997లో జన్మించిన నీరజ్ 13 ఏళ్ల వయసులో ఆడడం ప్రారంభించాడు. అప్పుడు అతను బరువు తగ్గడానికి, ఆత్మవిశ్వాసం పొందడానికి ఆడాడు. ఈ సమయంలో భారత జావెలిన్ త్రోయర్ జైవీర్ చౌదరి పానిపట్‌లోని శివాజీ స్టేడియంలో ఆడటం చూశాడు. అతను నీరజ్‌ని ఈ గేమ్‌కు పరిచయం చేశాడు. అతను ప్రపంచ ఛాంపియన్‌గా మారడంలో సహాయం చేశాడు. ఒక సంవత్సరం తర్వాత, అతను పంచకులలోని తౌ దేవి లాల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో కోచ్ నసీమ్ అహ్మద్ పర్యవేక్షణలో శిక్షణ ప్రారంభించాడు.
చిన్నప్పటి నుంచే అద్భుతాలు..
నీరజ్ చోప్రా 22 ఏళ్లకే స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నాడు. కానీ, చిన్న వయసులోనే ఛాంపియన్‌ లాంటి ఆటతో ఆకట్టుకున్నాడు. 2012లో 15 ఏళ్ల వయసులో నీరజ్ అండర్-16 జాతీయ ఛాంపియన్‌గా నిలిచాడు. ఈ ఈవెంట్‌లో అతను 68.60 మీటర్ల త్రో విసిరి కొత్త జాతీయ రికార్డును కూడా సృష్టించాడు. కేవలం రెండు సంవత్సరాల తరువాత, అతను యూత్ ఒలింపిక్ అర్హతలో తన మొదటి అంతర్జాతీయ రజత పతకాన్ని గెలుచుకున్నాడు. 2015లో, 18 సంవత్సరాల వయస్సులో, అతను చెన్నైలో జరిగిన ఇంటర్-స్టేట్ ఈవెంట్‌లో 77.33 మీటర్ల త్రో విసిరి తన మొదటి సీనియర్ జాతీయ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకున్నాడు.

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .