మంత్రి పొంగులేటి క్యాంప్ కార్యాలయాల్లో మహాత్మాగాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు
ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు
తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం, కూసుమంచి క్యాంప్ కార్యాలయాల్లో జాతిపిత మహాత్మాగాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలను బుధవారం నిర్వహించారు. ఖమ్మంలో జరిగిన వేడుకల్లో క్యాంప్ కార్యాలయ ఇన్ చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని వారి చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వారి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమాల్లో రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, నవాబ్ సాహెబ్, ఉమ్మినేని కృష్ణ, ఇమామ్ సాహెబ్, చల్లా రామకృష్ణ రెడ్డి, కానుగుల రాధాకృష్ణ, ధార్న రాజశేఖర్, చింతమళ్ళ గురుమూర్తి, కరాటే వేణు, దుంపల రవి, తోట ప్రసాద్, విష్ణువర్ధన్ రెడ్డి, విప్లవ్ కుమార్, జంగిపల్లి ప్రసాద్, ప్రభాకర్, తోట సైదులు, దండా సత్యనారాయణ, సమీరా, కూసుమంచిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయ ఇన్ చార్జ్ భీమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎంపీపీ బాణోతు శ్రీనివాస్, నేలకొండపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ వెన్నపూసల సీతారాములు, బజ్జూరి వెంకట్ రెడ్డి , కుక్కల హనుమంత రావు, హఫీజ్, రామ్ కుమార్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ వంగా నాయక్, కంచర్ల జీవన్ రెడ్డి, మాదాసు ఉపేందర్, బారి వీరభద్రం, వీరా రెడ్డి, సెట్రాం నాయక్, రాం రెడ్డి, సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Comments