మహిళా కాంగ్రెస్ సభ్యత్వ నమోదు ప్రారంభం*
*తెలంగాణ ముచ్చట్లు, మందమర్రి:-*
మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు మొగలి సునీత రావు పిలుపుమేరకు చెన్నూరు ఎమ్మెల్యే డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ల ఆదేశాల మేరకు పట్టణంలో సోమవారం మహిళా కాంగ్రెస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పార్టీ శ్రేణులు ప్రారంభించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పట్టణ మహిళా అధ్యక్షురాలు గడ్డం రజిని మాట్లాడుతూ, ఈ సభ్యత్వం ఐదు సంవత్సరాల వరకు పని చేస్తుందని తెలిపారు. ప్రతి మహిళ 100 రూపాయల రుసుము చెల్లించి, మహిళ కాంగ్రెస్ సభ్యత్వం తీసుకోవాల్సిందిగా కోరారు. కాంగ్రెస్ పార్టీ ద్వారానే అన్ని వర్గాలకు సముచిత న్యాయం జరుగుతుందని తెలిపారు. ముఖ్యంగా మహిళలకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడు అండగా ఉంటుందని, దీనికి నిదర్శనమే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 6 గ్యారంటీ పథకాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు నోముల ఉపేందర్ గౌడ్, నాయకులు సోత్కు సుదర్శన్, మండ భాస్కర్, కడారి జీవన్ కుమార్, బూడిద శంకర్, మంకు రమేష్, బుర్ర ఆంజనేయులు గౌడ్, మహిళా కాంగ్రెస్ నాయకురాలు పోచంపల్లి లక్ష్మీ, కళ, రమ, కవిత, ప్రసన్న నాయకులు తూముల శ్రీనివాస్, రవీందర్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.


Comments