ఖమ్మం మార్కెట్లో కి నూతన ఉత్పాదన ఇంప్లిసిట్ విడుదల
ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు :
భారతీయ బహుళ జాతీయ సంస్థ పారిజాత్ ఇండస్ట్రీస్ అండ్ ప్రైవేటు లిమిటెడ్ ఇండియా అధునాతన సాంకేతిక పరిశోధనతో రూపొందించిన ఇంప్లిసిట్ కీటకనాశిని పురుగుల మందును ఆదివారం ఖమ్మం నగరంలో గల వైరా రోడ్డు గల హేటల్ సూర్య తేజా లో సంస్థ సౌత్ డిజిఎం యు శ్రీనివాసులు రెడ్డి మార్కెట్లో కి విడుదల చేశారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ అన్ని రకాల క్రిమి సంహారక మందుల తోపాటు మొక్కలకు పోషకాలు అందించే ఉత్పత్తుల పోర్ట్ ఫోలియో పారిజాత్ అని పేర్కొన్నారు. ఇంప్లిసిట్ పత్తి, సోయా, మిరప, కూరగాయల పంటల్లో వచ్చు రబ్బరు పురుగు, లద్దేపురుగు, తామర పురుగు, నల్లిజాతుల నివారణకు ఇంప్లిసిట్ ను విడుదల చేశారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రీజినల్ హెడ్ రాజేందర్, మార్కెటింగ్ మేనేజర్ వి. ప్రసన్న కుమార్, ఖమ్మం టెర్రిటరీ మేనేజర్ పవన్ కుమార్, నల్గొండ టెర్రిటరీ మేనేజర్ రాజశేఖర్, డివిజనల్ మార్కెటింగ్ హెడ్ మధుసూదన్ రావు, డిస్ట్రిబ్యూటర్లు, డీలర్లు తదితరులు పాల్గొన్నారు.


Comments