సన్మార్గంలో నడపడానికి ఆవిర్భవించిన మతం ఇస్లాం

-శంకరాచార్య

సన్మార్గంలో నడపడానికి ఆవిర్భవించిన మతం ఇస్లాం

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు :

సెప్టెంబర్ 16 మిలాద్ – ఉన్-నబీ సందర్భంగా ....

ముహమ్మద్ ప్రవక్త జీవితంపై శంకరాచార్య పుస్తకం 

మానవత్వానికి పెద్ద పీట వేసి మానవాళిని సన్మార్గంలో నడపడానికి ఆవిర్భవించిన మతం ఇస్లాం. అయితే ఈ మత ఆవిర్భావం, వ్యాప్తి ఎన్నో సవాళ్లు, ఆటంకాలను ఎదుర్కొన్నది. కానీ ఇస్లాం ప్రవక్త మహమ్మద్(సఅసమ్) మొక్కవోని దీక్ష, సహనం వల్ల అది విశ్వవ్యాప్తమై మానవులకు సుఖ శాంతులను ప్రసాదించింది. మక్కాలో ఇస్లాం వ్యాప్తిని అడ్డుకోవడానికి ఖురైషులు చేసిన దౌర్జన్యాలను మహమ్మద్(సఅసమ్) ధైర్యంగా, సహనంతో, దయతో ఎదుర్కొన్న తీరు తెలుసుకొంటే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. ఆయన శత్రువులను సైతం దయతో మన్నించి సంస్కరించిన తీరు నేరగాళ్ల సంస్కరణకు మార్గదర్శకంగా నిలుస్తుంది. తాను చేసిన ప్రబోధనలను ఆయన ఆచరించి చూపిన తీరు మన జీవితాలకు మార్గదర్శకత్వం వహిస్తుంది. ‘పేదవాడైనా భిక్షాటన చేయకుండా స్వాభిమానంతో జీవించేవారిని అల్లాహ్ ప్రేమిస్తాడు’; ‘పెద్దలను గౌరవించనివాడు, పిల్లల పట్ల వాత్సల్యంతో మెలగనివాడు ముస్లిం కాడు’; ‘చాడీలు చెప్పేవాడు స్వర్గంలో ప్రవేశించలేడు’; ‘దారిలో అడ్డంగా పడి ఉన్న వస్తువును తొలగించడం కూడా సత్క్యార్యమే’.. లాంటి ఆణిముత్యాల్లాంటి ఆయన బోధనలు మనలో ఆత్మ విశ్వాసాన్ని, నైతిక నిష్ఠను పెంచుతాయి. ఇస్లాం ఆవిర్భావం, వ్యాప్తి; మహమ్మద్(సఅసమ్) జీవనం, ఆయన బోధనలకు సంబంధించిన మరెన్నో తెలుసుకోదగిన విషయాలను ఈ పుస్తకం వివరిస్తుంది.

పుస్తకం పేరు : మహమ్మద్ ప్రవక్త (సఅసమ్) చూపిన జీవని, ప్రబోధనలు

రచన : స్వామి లక్ష్మీ శంకరాచార్య, అనువాదం : పద్మావతి.పి.

ప్రచురణ : తెలుగు ఇస్లామిక్ పబ్లికేషన్స్ ట్రస్టు

పేజీలు : 32, వెల : ఉచితం, ప్రతులకు : 040-45723000 సంప్రదించండి.

సమీక్ష : ముహమ్మద్ ముజాహిద్, 9640622076.

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .