ప్రకృతి సృష్టించిన బీభత్సంతో కేరళ అతలాకుతలం.. అండగా నిలిచిన మోదీ సర్కార్..!
కేరళ రాష్ట్రాన్ని ఊహించని ప్రళయం కారణంగా దేశ మొత్తం అయ్యో పాపం కేరళ అనే రీతిలో అతలాకుతలం చేసింది. చిన్నపాటి నిర్లక్ష్యం వందల సంఖ్యలో మృతులకు కారణమైంది. ప్రకృతి సృష్టించిన బీభత్సంతో అతలాకుతలమైన వయనాడ్ జిల్లాలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటిస్తున్నారు.
అలాగే పునరావాస కేంద్రాలను సైతం ప్రధాని మోదీ సందర్శించి.. అనంతరం జరుగుతున్న సహాయ, పునరావాస చర్యలపై ఉన్నతాధికారులతో ప్రధాని సమీక్ష నిర్వహించారు. జాతీయ విపత్తుగా పరిగణించాలని ప్రధాని మోదీని కలిసి రాష్ట్ర మంత్రుల బృందం విజ్ఞప్తి చేసింది. ఈ నేపథ్యంలో వయనాడ్ ఘటనను ప్రధాని మోదీ జాతీయ విపత్తుగా ప్రకటించే అవకాశముంది.
జూలై 30వ తేదీన వయనాడ్లో ప్రకృతి విలయం తీవ్ర నష్టం కలిగించింది. కొండచరియలు విరిగిపడటంతో వైత్తిరి తాలూకాలోని ముండక్కై, చూరల్మల, అట్టమల గ్రామాలు ప్రభావితమయ్యాయి. ప్రజలు గాఢ నిద్రలో ఉన్న సమయంలో బురద, రాళ్లతో కూడిన నదీ ప్రవాహం ఊళ్లపై విరుచుకుపడింది. దీంతో పెను ప్రమాదం సంభవించింది. వయనాడ్ విపత్తులో 400 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఇంకా 200 మందికి పైగా ఆచూకీ లభ్యం కాలేదు.
ప్రకృతి విపత్తుతో వెంటనే అప్రమత్తమైన నరేంద్ర మోదీ ప్రభుత్వం పరిస్థితిని సమీక్షించింది. సంఘటన స్థలంలో రెస్క్యూ, రిలీఫ్ ఆపరేషన్ కోసం NDRF, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ, ఫైర్ సర్వీసెస్, సివిల్ డిఫెన్స్ వంటి 1200 మందికి పైగా రక్షకులను మోహరించడం ద్వారా వెంటనే చర్యలు చేపట్టింది. వైద్య సహాయం, చికిత్స కోసం డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బందితో పాటు 100 కి పైగా అంబులెన్స్లను సమకూర్చింది.
విపత్తు సవాలును ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండటానికి సకాలంలో నిధులు సమకూర్చడం ద్వారా కేంద్రం కేరళకు సహాయం చేస్తోంది. ఏప్రిల్ 1న, కేరళ SDRF ఖాతాలో దాదాపు రూ. 395 కోట్లు ఉన్నాయి. 145.60 కోట్లకు పైగా కొనసాగుతున్న సంవత్సరానికి SDRF సెంట్రల్ వాటా మొదటి విడత జూలై 31న ముందస్తుగా విడుదల చేయడం జరిగింది. గత 5 ఏళ్లలో మొత్తం దాదాపు రూ. 1780 కోట్లు. రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధిలో SDRFలో కేంద్రం వాటాగా 1200 కోట్ల రూపాయలను మోడీ ప్రభుత్వం విడుదల చేసింది. దీనికి తోడు మోదీ ప్రభుత్వం గత ఐదేళ్లలో రాష్ట్ర విపత్తుల నివారణ నిధికి రూ. 445 కోట్లు విడుదల చేసింది.


Comments