ఏకకాలంలో ఎన్నికలపై ఉన్నత స్థాయి కమిటీ సిఫార్సులు!
జమిలి ఎన్నికలు-మంత్రిమండలి ఆమోదం!
తెలంగాణ ముచ్చట్లు డెస్క్:
*దేశంలో ఏకకాలంలో ఎన్నికలు* నిర్వహించడంపై మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పడిన ఉన్నత స్థాయి కమిటీ సిఫార్సులను ప్రధానమంత్రి మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన విషయం తెలిసిందే!
*ఏకకాల ఎన్నికలు: ఉన్నత స్థాయి కమిటీ సిఫార్సులు*
1951, 1967 మధ్య ఏకకాలంలో ఎన్నికలు జరిగాయి..
*లా కమిషన్:* 170వ నివేదిక (1999): అయిదేళ్లలో లోక్సభతో పాటు అన్ని శాసనసభలకు ఒకే ఎన్నికలు.
*పార్లమెంటరీ కమిటీ 79వ నివేదిక (2015):* రెండు దశల్లో ఏకకాల ఎన్నికలకు సంబంధించిన పద్ధతులపై సూచన.
*రామ్ నాథ్ కోవింద్ అధ్యక్షతన* ఉన్నత స్థాయి కమిటీ రాజకీయ పార్టీలు, నిపుణులతో సహా భాగస్వాములందరితో విస్తృతంగా చేపట్టిన సంప్రదింపులు
* ఈ నివేదిక https://onoe.gov.in అందుబాటులో ఉంటుంది
* దేశంలో ఏకకాల ఎన్నికలకు విస్తృత మద్దతు ఉందని ఈ అభిప్రాయాలు తెలియజేస్తున్నాయి.
*సిఫార్సులు, ముందుకెళ్లే మార్గం:*
_రెండు దశల్లో అమలు_
*మొదటి దశ:* లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలి.
*రెండో దశ:* సాధారణ ఎన్నికలు జరిగిన 100 రోజుల్లోపు స్థానిక సంస్థల ఎన్నికలను (పంచాయతీ, మునిసిపాలిటీలు) నిర్వహించాలి.
* అన్ని ఎన్నికలకు ఉమ్మడి ఓటర్ల జాబితా
* దేశవ్యాప్తంగా సవివరమైన చర్చలు.
* అమలు కోసం ఒక గ్రూపును ఏర్పాటు.


Comments