టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలపై దాడి అనాగరికం

-టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పుల్లయ్య

టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలపై దాడి అనాగరికం

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు :

ఖమ్మం జిల్లా మున్నేరు పరివాహక ప్రాంతంలో మంగళవారం టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల బృందం సహాయక చర్యలు వరద బాధితులను పరామర్శించడానికి వచ్చిన వారిపై అధికార పార్టీకి చెందిన కొందరు దుండగులు దాడి చేయడం రాళ్లు విసరడం సరైన చర్య కాదని టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పెంట్యాల పుల్లయ్య బుధవారం తెలిపారు మండల పరిధిలో రచ్చగూడెం గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో సాయం చేయటానికి పరామర్శించడానికి వచ్చిన ప్రజాప్రతినిధులపై దాడి ఘటనలు సరికాదని, అధికారం ఎవరికి శాశ్వతం కాదని చరిత్ర చెబుతుందని పేర్కొన్నారు. ఇప్పటికైనా ఇలాంటి పద్ధతుల్ని అనాగరిక చర్యల్ని టిఆర్ఎస్ పార్టీ చింతకాని మండల కమిటీ ఖండిస్తున్నామని తెలిపారు . పార్టీలకతీతంగా వరద బాధితుల కోసం సహాయం చేయడానికి వచ్చిన వారిపై దాడి చేయడం సమంజసం కాదని టిఆర్ఎస్ పార్టీ మండల కమిటీ దాడికి ఖండన తెలియజేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మండల కమిటీ సభ్యులు ఆయా గ్రామ శాఖ అధ్యక్షులు మాజీ ప్రజా ప్రతినిధులు కార్యకర్తలు పాల్గొన్నారు

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .