కార్యకర్తలకు అండగా బిఆర్ఎస్ పార్టీ ...మాజీ మంత్రి పువ్వాడ
పార్టీ ప్రమాదబీమా చెక్కును బాధిత కుటుంబానికి అందజేసిన పువ్వాడ..
ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు :
ఖమ్మం నగరం 14వ డివిజన్ కు చెందిన ఇసంపల్లి శ్రీనివాసరావు మార్బుల్ వర్కర్ గా పనిచేసుకుంటూ బిఆర్ఎస్ కార్యకర్తగా సభ్యత్వం తీసుకున్నాడు. అతను ఇటీవల మార్బుల్ పనిచేస్తూ కరంట్ షాక్ తగిలి మరణించాడు.ఆ కుటుంబానికి పార్టీ ప్రమాద బీమా 2 లక్షల చెక్కును శ్రీనివాసరావు భార్య ఉపేంద్రమ్మ కి మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అందజేశారు. పార్టీ సభ్యత్వం తీసుకున్న వ్యక్తి ప్రమాదవశాత్తు మరణిస్తే 2 లక్షల ప్రమాదబీమా కుటుంబానికి ఇచ్చి బిఆర్ఎస్ పార్టీ వారి కుటుంబాన్ని ఆదుకుంటుందని బిఆర్ఎస్ కార్యకర్తలు అధైర్యపడొద్దని పార్టీ మనమందరికి అండగా ఉంటుoదని పువ్వాడ అన్నారు. ఈ కార్యాక్రమంలో కార్పొరేటర్ కూరాకుల వలరాజు,డివిజన్ అధ్యక్షులు జానీ,ఎస్సి సెల్ రామనర్సయ్య,మైనారిటీ సెల్ దస్తగిరి,కోటి,నాగరాజు,అశోక్,సతీష్,వెంకన్న,శరత్ తదితరులు పాల్గొన్నారు.


Comments