రైతులు ఆందోళన చెందవద్దు

--నీట మునిగిన భూములను పరిశీలించిన ఎమ్మెల్యే

రైతులు ఆందోళన చెందవద్దు

వనపర్తి జిల్లా ప్రతినిధి తెలంగాణ ముచ్చట్లు:

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పెద్దమందడి మండలం వెల్టూర్ గోపాల సముద్రం పూర్తిగా నిండడంతో బ్యాక్ వాటర్ తమ పంట పొలాలను ముంచేస్తుందని పెద్దమందడి మండలం మద్దిగట్ల గ్రామ రైతులు వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి దృష్టికి తీసుకువచ్చారు.

అందుకు సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే సోమవారం మద్దిగట్ల గ్రామ రైతులతో కలిసి నీటి మునిగిన భూములను పరిశీలించారు.

నీటి మునకకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.నూతనంగా నిర్మించిన చెరువు కట్ట నిర్మాణంలో అలుగును పెంచారని దాంతో తమ పొలాల్లోకి చెరువు నీరు చేరిందని రైతులు వాపోయారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చెరువు ఎఫ్ టి ఎల్ ను పరిశీలించి తగు చర్యలు చేపట్టి.. రైతులకు సహకరించాలని నీటి పారుదల శాఖ అధికారులకు సూచించారు.కార్యక్రమంలో నీటిపారుదల శాఖ అధికారులు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు రైతులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .