మర్రికుంట చెరువులోని గంగమ్మ తల్లికి పూజలు నిర్వహించిన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
వనపర్తి జిల్లా ప్రతినిధి తెలంగాణ ముచ్చట్లు:
వరుణ దేవుడు కరుణించి విస్తారంగా వర్షాలు కురిపించడంతో వనపర్తి నియోజకవర్గంలోని చెరువులు, కుంటలు,వాగులు జలకళతో నిండుకున్నాయి. మర్రికుంట చెరువును సందర్శించిన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అలుగు దగ్గర గంగమ్మ తల్లికి పూజలు నిర్వహించారు.ఆప్రాంత ప్రజలు నిరంజన్ రెడ్డి గారితో మాట్లాడుతూ ఒకనాడు ఈ చెరువు శిధిలమై అన్యాక్రాంతమై కంపచెట్లతో నిండుకోనీ ఉండేది అని మీ కృషివల్ల చెరువు చుట్టూ కరకట్ట నిర్మితమై సుందరమైన కట్టనిర్మాణంతో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేసి కట్టమీదుగా పట్టణానికి రహదారి ఏర్పాటు చేశారు అని అన్నారు.చెరువు పునరుద్ధరణతో దిగువ ప్రాంతాలు ముంపుకు గురికాకుండా ఉంది అని చెబుతూ నిరంజన్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలియజేసారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్ మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్,మండల పార్టీ అధ్యక్షులు మాణిక్యం,సింగిల్ విండో అధ్యక్షులు రఘువర్ధన్ రెడ్డి,మహేశ్వర్ రెడ్డి,సంపత్ కుమార్రెడ్డి,ఎర్పుల.తిరుపతయ్య,చిట్యాల.రాము, దేవర్ల.నరసింహ,నాగేంద్రము,బాబు నాయక్ తదితరులు పాల్గొన్నారు.


Comments