పేదలను అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యం
వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్,నాగరాజు
హసన్ పర్తి తెలంగాణ ముచ్చట్లు:
కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ సిఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు హాసన్ పర్తి మండల కేంద్రంలోని ఎర్రగట్టు శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో హసన్ పర్తి మండల పరిధిలోని పలు గ్రామాలలోని లబ్దీ దారులకు కళ్యాణ లక్ష్మి, షాదిముభారక్ సిఎంఆర్ఎఫ్ చెక్కులను 152 మంది సుమారు 1,00,52, 632 రూపాయల విలువ గల చెక్కులను వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పంపిణీ చేశారు.అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ
పేదలను అభివృద్ధి చేయడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం అని వర్ధన్నపేట ఎమ్మెల్యే అన్నారు.
సిఎం రేవంత్ రెడ్డి ఎన్నికలో రైతులకు ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల వరకు రుణమాఫీ చేశారని గుర్తుచేశారు.
రాష్ట్రంలో ఉన్న పేదలను అభివృద్ధి చేయడమే ప్రభుత్వం లక్ష్యం అని
అలాగే మీకు ఏ సమస్య ఉన్న టోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యను మాకు తెలియజేస్తే సత్వరమే పరిష్కరిస్తామని తెలియజేశారు.
రుణమాఫీ కానీ రైతులు ఎవరు అధైర్య పడవద్దని ప్రతిపక్షాలు చెప్పే చెప్పుడు మాటలు పట్టించుకోవద్దని మీకు ఏ సమస్య ఉన్న డైల్ యువర్ ఎమ్మెల్యే 80961017107 నెంబర్ కి ఫోన్ చేస్తే సమస్యను పరిష్కరిస్తాను హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు పోరెడ్డి మహేందర్ రెడ్డి,
55వ డివిజన్ కార్పొరేటర్ జక్కుల రజిత వెంకటేశ్వర్లు,ఎల్లాపూర్ గ్రామ పార్టీ అధ్యక్షుడు నేదునూరి సునీల్, కేతపాక సునీత రాజు,పిఎసిఎస్ చైర్మన్ రాజేష్ గౌడ్,
ఎర్ర ప్రకాష్,చిర్ర విజయ్,వీసం సురేందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.


Comments