ఉమ్మడి జిల్లా ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు...
పర్యావరణ హితంగా వినాయక చవితి ఉత్సవాలు జరుపుకుందాం...
-మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు
ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు :
ఖమ్మం మాజీ ఎంపీ, బి.ఆర్.ఎస్. సీనియర్ నాయకుడు నామ నాగేశ్వరరావు వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని ఉమ్మడి జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవల వర్షాలు, మున్నేరు వరదల వల్ల నష్టపోయిన కుటుంబాలకు అ గణనాథుని దీవెనలతో అండగా నిలబడాలని, ప్రతి ఒక్కరూ తమ వంతు సాయం చేయాలని పిలుపునిచ్చారు. సమాజం మొత్తం కలిసి పని చేస్తేనే సమస్యలను అధిగమించగలమని నామ అన్నారు. పండుగ వేళలో వినాయక చవితిని పర్యావరణ స్నేహపూర్వకంగా జరుపుకోవాలనీ, మట్టి వినాయక విగ్రహాలను మాత్రమే ప్రతిష్టించి పర్యావరణానికి హాని కలగకుండా పండుగను నిర్వహించాలని ఆయన కోరారు.
ఖమ్మం వరద బాధితుల సహాయార్ధం సిద్ధిపేట నుండి మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు నిత్యావసర సరుకులు పంపించడం మరియు రాజ్యసభ సభ్యులు బండి పార్ధ సారధి రెడ్డి కోటి విరాళం అందించినందుకు నామ అభినందనలు తెలుపుతూ, బి.ఆర్.ఎస్ శ్రేణులు అందరూ ఈ క్లిష్ట సమయంలో వరద బాధితులకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. పలు స్వచ్చంద సంస్థలు వరద బాధితులను ఆదుకోవడంలో ముందంజలో ఉన్నందుకు ఆయన అభినందనలు తెలిపారు.


Comments