ఎమ్మెల్యేను సన్మానించుకున్న మండల కాంగ్రెస్ నాయకులు
Views: 8
On
వనపర్తి జిల్లా ప్రతినిధి తెలంగాణ ముచ్చట్లు:
నియోజకవర్గ మండలాలలోని గ్రామాలకు నూతన విద్యుత్ ఉపకేంద్రాలను మంజూరు చేయించిన సందర్భంగా వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి గారిని ఆదివారం వనపర్తి మండలం కాశీంనగర్, పెద్దమందడి మండలం పామిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన నాయకులు కార్యకర్తలు శాలువాలతో సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు.ఎంతోమంది ఎమ్మెల్యేల చుట్టూ తిరిగిన అధికారులకు పాలు మార్లు విన్నవించుకున్న ఇప్పటివరకు ఎవరు పట్టించుకోలేదని విద్యుత్ సమస్యలు ఉన్నాయని ఒకే ఒక్కసారి వనపర్తి ఎమ్మెల్యే మేఘా రెడ్డి గారి దృష్టికి తీసుకువస్తే ఒక్క నెలలోనే మా గ్రామాలకు విద్యుత్ ఉపకేంద్రాలను మంజూరు చేయించారని వారు ఎమ్మెల్యే గారికి శాలువాలతో సన్మానించి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆయా మండలాల గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments