నేడు ఉమ్మడి ఖమ్మంజిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన

నేడు ఉమ్మడి ఖమ్మంజిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు :

తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఉమ్మడి ఖమ్మంజిల్లాలో సోమవారం పర్యటించనున్నారు. ఈ మేరకు మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇన్ చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. పర్యటనలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచలో ఉదయం 10.30 గంటలకు పాల్వంచ ప్రెస్ క్లబ్ నూతన భవనాన్ని ప్రారంభిస్తారన్నారు. అదేవిధంగా కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని మేదరబస్తీలో కౌన్సిలర్ పూర్ణ కుటుంబాన్ని పరామర్శిస్తారని తెలిపారు. మధ్యాహ్నం 02.45 గంటలకు ఖమ్మం నగరంలోని అల్లీపురం కొత్తగూడెంలో శీతల రామసంగం కుటుంబాన్ని, సహకారనగర్ లో కిలారు రామకృష్ణ కుటుంబాన్ని పరామర్శిస్తారని పేర్కొన్నారు. సాయంత్రం నాలుగు గంటలకు కూసుమంచి క్యాంపు కార్యాలయంలో గీత కార్మికులకు కాటమయ్య రక్ష కిట్ల పంపిణీ చేస్తారన్నారు. అనంతరం రాత్రి ఎనిమిది గంటల వరకు ప్రజలకు, నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు అందుబాటులో ఉంటారని దయాకర్ రెడ్డి తెలిపారు. పర్యటనను విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను , అభిమానులను కోరారు

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .