ఖమ్మం లో ద్విచక్ర వాహనంపై పర్యటించిన మంత్రి తుమ్మల
ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు :
శుక్రవారం నాడు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరావు త్రీ టౌన్ ప్రాంతంలో నగరంలో ద్విచక్ర వాహనంపై మున్సిపల్ కమిషనర్, నగర మేయర్ తో పర్యటించి పలు సమస్యలు తెలుసుకుని తగు సూచనలు జారీ చేసి పనులను త్వరిత గతిన పూర్తి చేయాలని ఆదేశించారు ..అనంతరం ఖమ్మం మార్కెట్ ఏరియా మరియు ప్రకాష్ నగర్ లో పర్యటించి సమస్యలు తెలుసుకున్నారు.
దంసలాపురం ఎగ్జిట్ పాయింట్ దగ్గరికి వెళ్లి ఎగ్జిట్ పనులను పరిశీలించి త్రీ టౌన్ ప్రాంతానికి కలిపే రోడ్డుని డబల్ రోడ్డు ఏర్పాటునీ చేయాలని సూచించారు..ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ అభిషేక్ ఆగస్త్య నగర మేయర్ పూనకొల్లు నీరజ ,సాధు రమేష్ రెడ్డి, కమర్తపు మురళి, తిలక్ ,తల్లాడ రమేష్ , ఆళ్ల అంజిరెడ్డి, కొప్పెర ఉపేందర్, గజ్జల వెంకన్న,వల్లపు ఉపేందర్, ఖాదర్ బాబా,మందడపు బ్రహ్మారెడ్డి,తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు..


Comments