ముంద‌రి తండా ప్రజల దాహార్తిని తీర్చిన ఎమ్మెల్యే మేఘారెడ్డి

ముంద‌రి తండా ప్రజల దాహార్తిని తీర్చిన ఎమ్మెల్యే మేఘారెడ్డి

వనపర్తి జిల్లా ప్రతినిధి తెలంగాణ ముచ్చట్లు:

పెద్దమందడి మండ‌ల ప‌రిధిలోని ముంద‌రి తండాలో నెల‌కొన్న తాగునీటి స‌మ‌స్య‌కు ప‌రిష్కారం ల‌భించింది. తండాలో నీటి ఎద్ద‌డి ఉంద‌ని గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల ముందు ఎమ్మెల్యే మేఘారెడ్డి దృష్టికి తీసుకువెళ్ల‌గా స్పందించిన ఆయ‌న శ‌నివారం బోరు బండిని పంపించ‌గా తండాలో బోరు వేయించిన‌ట్లు మాజీ స‌ర్పంచ్ జ‌యంతి శంక‌ర్ నాయ‌క్ తెలిపారు. గ్రామంలో నీటి స‌మ‌స్య ప‌రిష్కారం అయ్యింద‌ని శ‌నివారం వేసిన బోరులో నీరు పుష్క‌లంగా రావ‌డం జ‌రిగింద‌ని మాజీ స‌ర్పంచ్ జ‌యంతి శంక‌ర్ నాయ‌క్ , కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు రాములు నాయ‌క్‌, మోహ‌న్ నాయ‌క్‌, చంద్రు, కిష‌న్‌, దేవుజా , గౌడ , క్రిష్ణ‌, హ‌నుమంతు, ర‌మేష్‌, శంక‌ర్‌, చందు నాయ‌క్ లు, మ‌హిళా కార్య‌క‌ర్త‌లు నీల‌మ్మ‌, గోర‌మ్మ‌, మోతిభాయి తెలిపారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే మేఘారెడ్డి కి ఆమె కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .