ఎమ్మేల్యే వాకిటి శ్రీహరికి మంత్రి పదవి దక్కాలని పాదయాత్ర
మక్తల్ , తెలంగాణ ముచ్చట్లు:
తమ అభిమాన నాయకుడు ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి మంత్రి పదవి దక్కాలని కోరుతూ,అమరచింత మండలము కాంగ్రెస్ పార్టీ నాయకులు పాదయాత్ర చేశారు. అమరచింత మండలం చంద్రనాయక్ తండాకు చెందిన హన్మంతు నాయక్ ( ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు), సూర్యనాయక్ ఇద్దరూ తమ ఊరి నుంచి దాదాపు 45 కిలోమీటర్ల మక్తల్ కు పాదయాత్ర నిర్వహించారు. తెల్లవారుజామున నాలుగున్నర కు పాదయాత్ర ప్రారంభించామని, సాయంత్రం అయిదు గంటల వరకు మక్తల్ పట్టణానికి చేరుకున్నామని అన్నారు . అనంతరం స్థానిక పడమటి ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మక్తల్ కాంగ్రెస్ పార్టీ నేతలు వారిని శాలువాతో ఘనంగా సత్కరించారు. ఎమ్మేల్యే వాకిటి శ్రీహరికి మంత్రి పదవి దక్కితే వెనుకబడిన మక్తల్ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నేతలు కట్టా సురేష్ గుప్తా, బోయ రవికుమార్, నాగరాజు, ఓబ్లేశ్, కల్లూరి గోవర్ధన్, గుంతలి రవి, వేణు గౌడ్, సురేందర్ గౌడ్, ఇతర నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.


Comments