పెసరకు కనీస మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయాలి
-రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళీ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
Views: 3
On
ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు :
ఖమ్మం వ్యవసాయ మార్కెట్ లో ఏర్పాటు చేసిన పెసర కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళీ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శనివారం ఆకస్మిక తనిఖీ చేశారు. కొనుగోలు కేంద్రానికి వచ్చిన పెసర ను మంత్రి పరిశీలించారు. వాతావరణ పరిస్థితుల తేమ శాతం నిర్ధారిత ప్రమాణం కంటే ఎక్కువగా ఉందన్నారు. ఎఫ్ఏక్యూ ప్రమాణాల మేరకు ఉన్న పెసరకు కనీస మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. మంత్రి తనిఖీ సందర్భంగా జిల్లా మార్క్ ఫెడ్ అధికారి సునీత, జిల్లా వ్యవసాయ అధికారి పుల్లయ్య, అధికారులు, రైతులు తదితరులు వున్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments