ఉద్యమకారులకు గుర్తింపు కాంగ్రెస్ పార్టీతోనే
ఓయూ జేఏసీ నేత ఇప్ప పృథ్వి రెడ్డి
తెలంగాణ ముచ్చట్లు దేవరుప్పుల :
ఉద్యమకారులకు కాంగ్రెస్ హయాంలోనే గుర్తింపు లభించింది ఓయూ జెఏసి నేత ఇప్ప పృథ్వి రెడ్డి అన్నారు.తెలంగాణ బీసీ కమిషన్ సభ్యురాలిగా ఎన్నికయిన బాలలక్ష్మిని ఓయూ జేఏసీ నేత ఇప్ప పృథ్వి సోమవారం హైదరాబాదులోని ఖైరతాబాదులో కలిసి శుభాకాంక్షలు తెలిపి ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు.అనంతరం వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉద్యమకారులకు గుర్తింపు ఉంటుందనడానికి బాలలక్ష్మి బీసీ కమిషన్ సభ్యురాలిగా ఎన్నికవడమే నిదర్శనమని తెలిపారు.తెలంగాణ ఉద్యమంలో బాలలక్ష్మి పాత్ర అనిర్వచనీయమని,కేవలం తెలంగాణ ఉద్యమమే కాక అనేక సామజిక ఉద్యమాల్లో బాలలక్ష్మి పాత్ర ఉందని అన్నారు.గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో తెలంగాణ ఉద్యమకారులకు అన్యాయం జరిగిందని,కెసిఆర్ కుటుంబానికి,వారి బంట్రోతులకు మాత్రమే పదవులు దక్కాయని,కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన 6 గ్యారంటీలు తప్పక అమలు అవుతాయన అన్నారు.ఈ కార్యక్రమంలో దేవరుప్పుల మండల యువజన నాయకులు కరికే విజయ్ కుమార్తదితరులు పాల్గొన్నారు.


Comments