ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ధ్యేయం...!
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు మద్దినేని బేబి స్వర్ణకుమారి
- మంత్రిపొంగులేటి క్యాంపు కార్యాలయం లో సీఎం ఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు :
ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయమని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు మద్దినేని బేబి స్వర్ణకుమారి అన్నారు. ఖమ్మంలోని మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయంలో పాలేరు నియోజకవర్గంలోని తిరుమలాయపాలెం, నేలకొండపల్లి మండలాల చెక్కుల పంపిణీ కార్యక్రమం గురువారం జరిగింది. ఈ సందర్భంగా రెండు మండలాలకు చెందిన 37మంది లబ్ధిదారులకు రూ. 11 లక్షల 50వేలు విలువ చేసే చెక్కులను అందించారు. స్వర్ణకుమారి మాట్లాడుతూ పాలేరు నియోజకవర్గ అభివృద్దే ధ్యేయంగా మంత్రి పొంగులేటి కృషి చేస్తున్నారన్నారు. పాలేరు ప్రజలకు ఏ కష్టం వచ్చినా మంత్రి పొంగులేటి శీనన్న ఆదుకుంటారని అభయమిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు చావా శివరామకృష్ణ, మాజీ ఎంపీపీ కొప్పుల అశోక్, నేలకొండపల్లి మార్కెట్ చైర్మన్ వెన్నపూసల సీతారాములు, మద్దుల పల్లి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నరేందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ జడల నగేష్ గౌడ్ , శాఖమూరి రమేష్, తాటికొండ కిరణ్, అశోక్, దూదిమట్ల వెంకట్, నాగరాజు, వెంకన్న, ఉన్నం రాజశేఖర్ తదితరులు ఉన్నారు.


Comments