రోడ్డు నిర్మాణం పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

రోడ్డు నిర్మాణం పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

వనపర్తి జిల్లా ప్రతిని తెలంగాణ ముచ్చట్లు:

వనపర్తి నుంచి ఖిల్లా ఘణపురం వెళ్లే ప్రధాన రహదారి సోలిపురం నుంచి ఖిల్లా ఘణపురం మండల కేంద్రం వరకు 10 కిలోమీటర్ల మేర రోడ్లు భవనాల శాఖ నిధులు 6కోట్ల 60 లక్షల రూపాయలతో చేపట్టిన బీటి రోడ్డు నిర్మాణం పనులకు బుధవారం వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి శిలాఫలకం వేశారు.పూర్తి శిధిలావస్థగా మారిన రోడ్డుపై ప్రయాణించేందుకు మండల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఈ రోడ్డు నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించి నిధులు మంజూరు చేయించి నేడు రోడ్డు నిర్మాణానికి తలపెట్టమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.నేడు ఈ రోడ్డు నిర్మాణంతో వనపర్తి మహబూబ్నగర్ వెళ్లే ప్రధాన రహదారి సమస్యలు తీరుతాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు.కార్యక్రమంలో రోడ్లు భవనాల శాఖ అధికారులు ఖిల్లా ఘనపురం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .