ఎంపీ కడియం కావ్యను కలిసిన యువ తెలంగాణ ఆటో యూనియన్ నాయకులు
హన్మకొండ,తెలంగాణ ముచ్చట్లు:
హనుమకొండ లోని కనకదుర్గ కాలనీ నందు వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్యను యువతెలంగాణ ఆటో యూనియన్ వరంగల్ బస్టాండ్ మెయిన్ గెట్ కమిటీ సభ్యులు శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు.
గత కొద్ది రోజులుగా ఆటో డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలను,
కుటుంబ ఆర్థిక స్థితిగతులపై పడుతున్న భారాలను ఎంపీ కావ్యకు యూనియన్ అధ్యక్షులు తాటికాయల ఎల్లస్వామి ఈ సందర్భంగా విన్నవించారు. రాబోవు రోజుల్లో ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని,ఆ దిశగా భరోసా అందించాలని,
మా డ్రైవర్ కుటుంబాలకు చేయూతనందించాలని
ఎంపీని కోరారు.సానుకూలంగా స్పందించిన ఎంపీ కడియం కావ్య.. ఆటో డ్రైవర్ల సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, వారిని అన్నివిధాల ఆదుకుంటాం అని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో యువతెలంగాణ ఆటో యూనియన్ సంఘం అధ్యక్షుడు తాటికాయల ఎల్లస్వామి, ఉపాధ్యక్షుడు అచ్చె కృష్ణ, కోశాధికారి బోడ సురేష్, భూక్య బాలు, దాసి సదానందం, శ్యామల దయాకర్, భూక్య సుమన్, తదితరులు పాల్గొన్నారు.


Comments