కేటీఆర్ ను కలిసిన రాజారపు సుమన్
మాజీ ఎమ్మెల్సీ పల్లాను మర్యాద పూర్వకముగా కలిసిన సుమన్
Views: 16
On
ధర్మసాగర్,తెలంగాణ ముచ్చట్లు:
బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిండెంట్,మాజీ మంత్రి కేటీఆర్ ను ధర్మసాగర్ మండల బిఆర్ఎస్ పార్టీ యువ నాయకులు,మండల యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాజారపు సుమన్ మంగళవారం హైదరాబాద్ నంది హిల్స్ లోని వారి నివాసంలో మర్యాద పూర్వకముగా కలిశారు.ఈ సందర్భంగా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు వచ్చే అవకాశాలు ఉన్నాయని,అందుకు సిద్ధంగా ఉండాలని,యువత కీలకంగా పనిచేసి స్టేషన్ ఘనపూర్ లో మళ్ళీ గులాబీ జెండాను ఎగురవేయాలని కేటీఆర్ సూచించినట్లు సుమన్ తెలిపారు.అనంతరం మాజీ ఎమ్మెల్సీ,జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిని రాజారపు సుమన్ మర్యాద పూర్వకముగా కలిసి,దసరా శుభాకాంక్షలు తెలియజేశారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments