రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల్లో సర్వజ్ఞ విద్యార్ధులు.
ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు
ఈ
నేల 29 న ఖమ్మం జిల్లాలో సర్దార్ పటేల్ స్టేడియం లో రాష్ట్ర స్థాయి పోటీల్లో ఖమ్మం జిల్లా తరుపున మన సర్వజ్ఞ పాఠశాల విద్యార్ధిని విద్యార్ధులు ఎంపిక అవ్వడం ఎంతో గర్వకారణం. అండర్ 14,17 ఫుట్బాల్ మరియు అథ్లెటిక్ అండర్ 17 రన్నింగ్ లో సర్వజ్ఞ విద్యార్ధులు ఎంపిక అవ్వడం ఎంతో ఆనందంగా
వుందని పాఠశాల డైరెక్టర్ ఆర్వీ. నాగేంద్ర కుమార్ తెలిపారు. కేవలం
ఆటపోటిల్లోనే కాకుండా అన్ని రంగాలలో కూడా విద్యార్థులను ముందంజ
స్థాయిలో ఉంచడానికి సర్వజ్ఞ ఎప్పుడు తోడుగా ఉంటుందని తెలిపారు. అదేవిధంగా సర్వజ్ఞ విద్యార్థులకు వారి దినచర్యలో శారీరక విద్యను నేర్పించడం
ద్వారా సమతుల్య జీవనశైలిని అభివృద్ధి చేయడంలో సహాయపడటానికి
ఉపయోగపడుతుంది, ఇది సమతుల్యతను కనుగొనడంలో, ఒత్తిడిని తగ్గించడంలో మరియు వారి మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
ఎంపికైన విద్యార్థులకు ఇది గొప్ప విజయం, వారి కృషి మరియు అంకితభావాన్ని
మేము అభినందిస్తున్నాము. వారి రాబోయే పోటీల్లో విజయం సాధించాలని
పాఠశాల అధ్యాపకులు మరియు యాజమాన్యం విద్యార్థులకు శుభాకాంక్షలు
తెలియజేసారు. మున్ముందు మరెన్నో పోటీ క్రీడలలో పాల్గొని విజయం సాధించి
వారి జీవితంలో ఉన్నత స్థాయి కి ఎదగాలని డైరెక్టర్ ఆర్వీ. నాగేంద్ర కుమార్
తెలియజేసారు.


Comments