రామాలయ ఆవరణలో మద్యం సేవిస్తూ దోరికిన యువత
మా నాన్న ఎవరో తెలుసా అంటూ కాలనిలో మందుబాబుల వీరంగం
వేలేరు:
మండలంలోని మలికుదుర్ల గ్రామంలో గల రామాలయం ఆవరణలో కొందరు యువకులు సభ్యత సంస్కారం లేకుండా ఆలయ ఆవరణలోనే మందు సేవిస్తున్నారు. ఇది పద్ధతి కాదని ప్రశ్నించే వారిపై మందుబాబులు చేయి చేసుకుంటూ గొడవకు దిగుతున్నారు. రోజు రోజుకి మందుబాబుల ఆగడాలకు అడ్డుకట్టు లేకుండా పోతుంది. మద్యం సేవిస్తూ దారిన పోయే వారితో కావల్చుకొని గొడవకు దిగుతున్నారు. ఏమీ చేయలేని పరిస్థితిలో కాలనీవాసులు కృంగిపోతున్నారు, మద్యం మత్తే కాకుండా గంజాయి, డ్రగ్స్ కోరల్లో మల్లికుదుర్ల గ్రామ యువత నిర్బంధమైపోతూందనిపలువురుఅభిప్రాయపడుతున్నారు.తాజాగా శనివారం సాయంత్రం దర్జాగా మందుబాబులు ఆలయ ఆవరణలో మద్యం సేవిస్తూ కనబడటంతో అప్రమత్తమైన స్థానికులు ఇది సభ్యత కాదని ప్రశ్నించడంతో ప్రశ్నించిన వారిపై దౌర్జన్యానికి దిగుతూ గుండాయిజాన్ని ప్రదర్శిస్తున్నారు. విద్యుత్ దీపాలు లేని కారణంగా చీకటి పడటంతో అసాంఘిక కార్యకలాపాలకు కూడా ఆ గదులను వాడుకుంటున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి, ఇది చూడలేని స్థానికుల గోడు మిన్ను అంటుతున్నది. ఇప్పటికైనా అధికారులు చొరవ చూపి మద్యం, డ్రగ్స్ వంటి వాటి నుండి యువతను రక్షించాలని స్థానికులు కోరుతున్నారు.


Comments