నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు
బజార్ హత్నూర్ ఎస్సై అప్పారావు
అదిలాబాద్,తెలంగాణ ముచ్చట్లు:
న్యూ ఇయర్ వేడుకలు సందర్భంగా బజార్ హత్నూర్ ఎస్సై అప్పారావు మాట్లాడుతూ 31 డిసెంబర్ అర్ధరాత్రి 12 గంటల తర్వాత ప్రజలు రహదారుల్లో తిరగకూడదని, పోలీసు పికెటింగ్, రాత్రి గస్తీలు, వాహనాల తనిఖీలు పకడ్బందీగా చేపట్టాలని సిబ్బందికి ఆదేశించారు.
వైద్య, పోలీసు సహకారంతో, ఆంక్షలు పాటిస్తూ న్యూ ఇయర్ వేడుకలు జరపాలని, ప్రజలు ఇంట్లోనే కుటుంబ సభ్యులతో కలసి వేడుకలు జరపాలని కోరారు. బహిరంగ ప్రదేశాల్లో కేక్ కటింగ్, పార్టీలు, డీజేలు, లౌడ్స్పీకర్లు ఉపయోగించడం మరియు డ్యాన్సులు చేయడం నిషేధించబడ్డాయని తెలిపారు.
అర్ధరాత్రి 12 గంటల తర్వాత ప్రజలు రహదారులపై గుమిగూడి ట్రాఫిక్ను ఇబ్బంది పెట్టరాదని, మహిళలు, యువతులను ఈవీజింగ్ చేయరాదని, మద్యం సేవించి లైసెన్స్ లేకుండా వాహనాలు నడపరాదని ఆయన స్పష్టం చేశారు.
ర్యాష్ డ్రైవింగ్, బైక్ రేసులు, త్రిబుల్ రైడింగ్పై పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తారని, ఇందులో భాగంగా వాహనాలు సీజ్ చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే, బాణసంచా సామగ్రి కాల్చడం కూడా నిషేధించారు.
మద్యం దుకాణాలు ప్రభుత్వ నిర్ణీత సమయం మేరకే పనిచేస్తాయని, ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని బజార్ హత్నూర్ ఎస్సై అప్పారావు తెలిపారు.


Comments