ముగ్గురు పేకాటరాయుళ్లు అదుపులోకి తీసుకొన్న టాస్క్ ఫోర్స్, ఆర్బన్ పోలీసులు..
ఇన్స్పెక్టర్ ఖానాపురం హవేలీ
ఖమ్మం బ్యూరో, తెలంగాణ ముచ్చట్లు:
కొంతమంది పేకాట ఆడుతున్నట్లు అందిన విశ్వసనీయ సమాచారంతో టాస్క్ ఫోర్స్, ఖానాపురం హవేలీ పోలీసులు కలసి నగరంలోని కైకొండయిగూడెం గ్రామంలో తనిఖీలు నిర్వహించి పేకాట అడుతున్న ముగ్గురుని అదుపులోకి తీసుకోగా మరో నలుగురు పారిపోయారని ఖానాపురం హవేలీ ఇన్స్పెక్టర్ భానుప్రకాశ్ తెలిపారు. పేకాట అడుతున్న వారిని అదుపులోకి తీసుకోవాలన్న పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదేశాల మేరకు టౌన్ ఏసీపీ రమణమూర్తి, టాస్క్ ఫోర్స్ ఏసీపీ రవి పర్యవేక్షణలో టాస్క్ ఫోర్స్ ,ఖానాపురం హవేలీ పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. పేకాట ఆడుతున్న ఏడుగురు లో ముగ్గురు ని అదుపులోకి తీసుకొని వారి నుండి రూ.1950- నగదు, 2 బైకులు , 3 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
నిందుతులపై తెలంగాణ స్టేట్ గేమింగ్ యాక్ట్ కింద కేసులు నమోదు చేసినట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. చట్టవ్యతిరేక కార్యకాలాపాలకు పాల్పడితే ఏలాంటి వారినైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.
నిందితుల వివరాలు
1) పులుగుజ్జ.సారయ్య కైకొండాయిగూడెం , ఖమ్మం.
2) అంకర్ల వీరబాబు కైకొండాయిగూడెం,
3)తోట.రమణయ్య, కైకొండాయిగూడెం,
4) కోడిరెక్కల.సీతారాములు కైకొండాయిగూడెం.(పరారీలో ఉన్నారు)
5)కట్టా.నరేష్, కైకొండాయిగూడెం.(పరారీలో ఉన్నారు)
6)శీలం.శివ, కైకొండాయిగూడెం.(పరారీలో ఉన్నారు)
7)పిట్టల.వేణు, కైకొండాయిగూడెం.(పరారీలో ఉన్నారు)


Comments