మునుగోడు నియోజకవర్గానికి చిన్న నీటి వనరుల పటిష్టతకు సమగ్ర ప్రణాళిక

మునుగోడు నియోజకవర్గానికి చిన్న నీటి వనరుల పటిష్టతకు సమగ్ర ప్రణాళిక

మునుగోడు,తెలంగాణ ముచ్చట్లు:

మునుగోడు నియోజకవర్గంలోని చిన్న నీటి వనరులను పటిష్టం చేయడానికి నీటిపారుదల శాఖ అధికారులతో  ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి సమీక్ష నిర్వహించి సమగ్రమైన కార్యాచరణ రూపొందించారు. ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతమైన మునుగోడులో కురిసే ప్రతి నీటిబొట్టును చెరువులకు మళ్లించి భూగర్భ జలాల పెరుగుదలతో పాటు వ్యవసాయానికి మద్దతు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించారు.

నియోజకవర్గంలో ఉన్న 669 చెరువులలో గొలుసు కట్టు చెరువులకు నీరందించే ఫీడర్ ఛానళ్లను పటిష్టం చేయడం, చెరువులలో పేరుకుపోయిన పూడికను తొలగించడం, కట్టలను బలపరచడం వంటి పనులను విడతల వారీగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ చర్యలు భూగర్భ జలాలను పునరుద్ధరించి, నీటి వనరుల నిర్వహణను మెరుగుపరిచే దిశగా కీలకంగా ఉండనున్నాయి.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .