చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన
డివిజన్ అధ్యక్షులు కే శెట్టి ప్రసాద్
ఏఎస్ రావు నగర్, అక్టోబర్ 12 (తెలంగాణ ముచ్చట్లు)
ఉప్పల్ నియోజకవర్గ కాప్రా సర్కిల్ ఏ ఎస్ రావు నగర్ డివిజన్లో ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కేంద్రాలను డివిజన్ అధ్యక్షులు కే శెట్టి ప్రసాద్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఐదేళ్ల లోపు చిన్నారులకు తల్లిదండ్రులు తప్పక పోలియో చుక్కలు వేయించాలని ఆయన కోరారు. దేశం పూర్తిగా పోలియో రహితంగా మారేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని పిలుపునిచ్చారు.పోలియో చుక్కలు వేస్తున్న సిబ్బందికి భోజన సదుపాయాన్ని ఏర్పాటు చేసిన కే శెట్టి ప్రసాద్ మాట్లాడుతూ, “పోలియోను అంతమొందించాలంటే ప్రతి తల్లిదండ్రుల బాధ్యతగా తీసుకోవాలి. ప్రతి చిన్నారికి రెండు చుక్కల పోలియో వేయడం ద్వారా దేశ ఆరోగ్య భవిష్యత్తును కాపాడవచ్చు” అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఏఎస్ రావు నగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అజీజ్, లింగస్వామి, బి. నరసింహ, ఎస్.ఎం. సాహెబ్, రావు, ఎస్.ఎం. పీరా వలి తదితరులు పాల్గొన్నారు.


Comments