మధిర పట్టణంలో కబ్జాల జోరు వక్ఫ్ బోర్డ్ స్థలంపై కన్నేసిన కబ్జాకోరులు 

-మధిరలో వరుస కబ్జాలతో చర్చనీయాంశంగా మారిన విషయాల్లో ఇది కూడా ఒకటి

మధిర పట్టణంలో కబ్జాల జోరు వక్ఫ్ బోర్డ్ స్థలంపై కన్నేసిన కబ్జాకోరులు 

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు :

మధిర పట్టణం నడిబొడ్డున రైల్వే స్టేషన్ వద్ద ఉన్న ముకరం జాహి మస్జిద్ కి చెందిన కోట్ల విలువ చేసే వక్ఫ్ బోర్డ్ స్థలంపై కబ్జా కోరుల కన్ను పడింది. ముత్తాతలనాటి వారసులమంటూ మధిర మున్సిపాలిటీలో దొంగ చాటుగా యల్ ఆర్ ఎస్ తీసుకోవటానికి ప్రయత్నాలు చేస్తున్నారు.. మధిర పట్టణంలో ముస్లిం సోదరులు ముక్రం జాహి మజీద్ కు చెందిన స్థలాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు.. అట్టి స్థలాన్ని కొందరు వ్యక్తులు దొంగ చాటుగా ఆ స్థలానికి కబ్జా చేయటం కోసం దొంగ పత్రాలు సృష్టించి మధిర మున్సిపాలిటీలో ఎల్ఆర్ఎస్ కోసం అప్లై చేయడం జరిగింది ఇట్టి విషయాన్ని తెలుసుకున్న మధిర పట్టణ ముస్లిం సోదరులు, ముక్రం జాహి మజీద్ కమిటీ అధ్యక్షుడు అస్మతుల్లా మరియు కమిటీ సభ్యులు గురువారం మధిర మున్సిపాలిటీ కార్యాలయం నందు మధిర టౌన్ ప్లానింగ్ అధికారిని కలిసి ఈ మసీదుకు సంబంధించిన స్థలాలు కేవలం తెలంగాణ రాష్ట్ర వక్ఫ్ బోర్డు వారి స్థలాలుగా తెలియపరచి వాటికి సంబంధించిన రాజపత్రాన్ని మరియు వివిధ కోర్టులలో నడుస్తున్న కేసు వివరాలను టౌన్ ప్లానింగ్ అధికారికి ఇవ్వడం జరిగినది. ఇట్టి విషయాన్ని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మరియు ఖమ్మం జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకు వెళ్ళనున్నట్లు తెలిపారు..

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .