మడికొండలో సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులకు శంకుస్థాపన
వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు
కాజీపేట్,తెలంగాణ ముచ్చట్లు:
హనుమకొండ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గంలో అభివృద్ధి పనులను వేగవంతం చేస్తామని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. మడికొండ గ్రామంలో వేణుగోపాల స్వామి గుడి నుండి పోచమ్మగుడి వరకు సుమారు 37.5 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్డు మరియు డ్రైనేజీ పనులకు శుక్రవారం ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూప్రతి కాలనీ సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని, అంతర్గత రోడ్లు మరియు సైడ్ డ్రైన్ల నిర్మాణం నిరంతరంగా కొనసాగుతుందని పేర్కొన్నారు. కాలనీలలో ప్రజల నుంచి ఏవైనా సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని, వాటిని త్వరితగతిన పరిష్కరించేందుకు కట్టుబడి ఉన్నానని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ఆవాల రాధిక రెడ్డి, మెట్టుగుట్ట ఆలయ చైర్మన్ పైడిపాల రవిచందర్, మండల అధ్యక్షుడు సారంపల్లి శ్రీనివాసరెడ్డి, డివిజన్ అధ్యక్షుడు కుర్ల మోహన్, మహిళ మండల అధ్యక్షురాలు నీలం రజిని సహా పలువురు నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.


Comments