నిరుపేద కుటుంబానికి అండగా నిలిచిన హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి
పాలకుర్తి,తెలంగాణ ముచ్చట్లు:
పాలకుర్తి పట్టణానికి చెందిన మారోజు సునీత-శంకరాచారి దంపతుల కుటుంబానికి ఆర్థిక సహాయం చేసి తమ మానవత్వాన్ని చాటుకున్నారు పాలకుర్తి నియోజకవర్గ ఇంచార్జి హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి. ఈ కుటుంబానికి చెందిన కుమార్తె అఖిల వివాహానికి రూ. 25,000 ఆర్థిక సాయం అందించారు.
కుటుంబం కడు పేదరికంలో ఉండి, శంకరాచారి పనికి అగయోగ్యుడవడంతో వివాహ ఏర్పాటుకు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలుసుకున్న ఝాన్సీ రెడ్డి, వారికి అండగా నిలిచారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, “నిరుపేదల కుటుంబాలను సాయం చేయడంలోనే అసలైన ఆనందం ఉంది. నా నియోజకవర్గంలో ఎవరికైనా సమస్యలు ఉంటే నేరుగా నన్ను సంప్రదించవచ్చు. సహాయం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాను” అని పేర్కొన్నారు.
అంతేగాక, సామాజిక బాధ్యతతో మానవతావాదులు నిరుపేదలకు సహాయం చేయడానికి ముందుకు రావాలని ఝాన్సీ రెడ్డి పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో బ్లాక్ అధ్యక్షుడు రాపాక సత్యనారాయణ, పట్టణ అధ్యక్షుడు నాగన్న, మాజీ సర్పంచ్ యాకాంతరావు, పెనుగొండ రమేష్, పార్టీ నాయకులు పాల్గొన్నారు.


Comments