ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని వినతి పత్రం...
బిఆర్ఎస్ నాయకులు మంకెన రమేష్
Views: 35
On
ఖమ్మం బ్యూరో చీఫ్, సెప్టెంబర్ 24,తెలంగాణ ముచ్చట్లు:
ఇటీవల అకాల వర్షాలతో చింతకాని మండలం నాగిలిగొండ గ్రామంలో నిరుపేద కుటుంబం అయిన చాట్ల మరియదాసు ఇల్లు పూర్తిగా దెబ్బతినడం జరిగింది. మరియదాసు కి ఇల్లు లేకపోవడంతో వారిని బిఆర్ఎస్ నాయకులు కలిసి వారికి ధైర్యాన్ని ఇచ్చి వెంటనే చింతకాని తాసిల్దార్ కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మంకెన రమేష్ మాట్లాడుతూ గ్రామాలలో పూర్తిస్థాయిలో ఎంక్వయిరీ చేసి ఎవరైతే అర్హులు ఉన్నారో ఇందిరమ్మ ఇళ్ళకి అర్హులను గుర్తించి వారికి ఇల్లు మంజూరు చేయాలని వారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల కమిటీ నాయకులు గురీజాల హనుమంతరావు, వెంకటరామయ్య, చాట్ల సురేష్, చాట్ల భగవాన్ మరియు తదితరులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments