కాచిగూడ - అనకాపల్లి రైలుకు మల్కాజ్ గిరిలో ఘన స్వాగతం

కాచిగూడ - అనకాపల్లి రైలుకు మల్కాజ్ గిరిలో ఘన స్వాగతం

IMG-20251003-WA0009మల్కాజ్‌గిరి, అక్టోబర్ 3 (తెలంగాణ ముచ్చట్లు):

మహాత్మా గాంధీ జయంతి, దసరా పండుగ మరియు సౌత్ సెంట్రల్ రైల్వే 59వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన 07055 కాచిగూడ - అనకాపల్లి పండుగ ప్రత్యేక రైలుకు మల్కాజ్ గిరి ప్రజలు ఘన స్వాగతం పలికారు.ఈ రైలు ప్రతి గురువారం సాయంత్రం 4:50 గంటలకు కాచిగూడ నుండి బయలుదేరి, మల్కాజ్ గిరి వద్ద సాయంత్రం 5:10 - 5:12 గంటల మధ్య ఆగి, మరుసటి రోజు ఉదయం 8:00 గంటలకు అనకాపల్లికి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో అనకాపల్లి సాయంత్రం 5:35 గంటలకు బయలుదేరి, మల్కాజ్ గిరి వద్ద 6:43 - 6:45 ఆగి, రాత్రి 9:00 గంటలకు కాచిగూడకు చేరుతుంది అని రైలు ప్రయాణికుల సంఘం ప్రతినిధులు తెలిపారు.
ఈ సందర్భంగా సంఘం ప్రతినిధులు ఏ.వి. స్వామి, కరీమా, పి. భరద్వాజ్, వహీదా, ధనుంజయ్, హసీనా, రామచంద్ర రెడ్డి తదితరులు పాల్గొని, మల్కాజ్ గిరిలో హల్ట్ సౌకర్యం కల్పించినందుకు సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాత్సవ, హైదరాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ సంతోష్ కుమార్ వర్మ మరియు ఇతర అధికారులకు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.అదే సమయంలో, మల్కాజ్ గిరి వద్ద రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌ కూడా నిలపాలని పలువురు ప్రయాణికులు కోరారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .